న్యూఢిల్లీ: ఏడేళ్లుగా పోరాడుతున్నాం... మరో ఏడు రోజులు ఆగలేమా ? ఆగుతాం... డిసెంబర్ 18న నిర్భయ కేసు దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని భావిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు.. ఉరి శిక్ష అమలు చేస్తారని దేశం మొత్తం ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. కచ్చితంగా త్వరలోనే అది జరిగి తీరుతుందనే నమ్మకంతో ఉన్నట్టు ఆమె తెలిపారు.