సుప్రీంకోర్టు 'పద్మావత్' సినిమా విషయంలో ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని కోరుతూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే..! దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా సినిమాను అడ్డుకోవడం సరైంది కాదు. ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పు లేదు. కావాలంటే సినిమాను చూడవద్దు అని ప్రజలకు చెప్పుకోండి. అంతేగానీ సినిమా విడుదలను అడ్డుకోవద్దు అని కర్ణిసేన, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సూచిస్తూ పిటీషన్ ను కొట్టేసింది. 


మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు 'పద్మావత్' సినిమా విడుదలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం(జనవరి 25) సినిమా విడుదలైతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలకు రాజ్ పుత్, కర్ణిసేనలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ తరుణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి..!!