బల్లియా (ఉత్తరప్రదేశ్) : బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసులకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. హైకమాండ్ కూడా వారిని ఏమీ అనకపోవడంతో వాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'భారత్ మాతా కీ జై' అని చెప్పని వ్యక్తులు పాకిస్థానీయులు అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే బైరియా సురేంద్ర నారాయణ్ సింగ్ అన్నారు. ఫిబ్రవరి 25న బల్లియాలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బైరియా, 'భారత్ మాతా కీ  జై' అని అనకుండా వ్యతిరేకించే వాళ్లు పాకిస్తానీయులు' అని అన్నారు.  


 నారాయణ్ సింగ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2024 భారతదేశం ఒక హిందూ దేశంగా మారుతుందని చెప్పారు. దేశం హిందూరాష్ట్రంగా మారినప్పుడు, హిందూ సంస్కృతిలో కలిసిపోయే ముస్లింలు మాత్రమే దేశంలో ఉంటారన్నారు.


గత నెలలో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మాట్లాడుతూ, ముస్లింలు మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేశారు. అందువల్ల వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలన్నారు.