ఆదాయపు పన్ను విభాగంలో మరో కీలకమైన పధకం ప్రారంభం కానుంది. ఇన్ కంటాక్స్ చెల్లింపుదార్లకు గౌరవం అందించే వినూత్న పధకమిది. ఆగస్టు 13 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


“Transparent Taxation – Honoring the Honest” పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 13 ఉదయం 11 గంటలకు ఈ వినూత్న పధకం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభం కానుంది. పారదర్శక పన్ను విధానం-నిజాయితీకు గౌరవం పేరుతో ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోని పన్ను విధానంలో సంస్కరణలు, సరళీకృతం దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఈ కొత్త విధానం బలం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతున్నవారికి ఇది మేలు చేకూరుస్తుందని మోదీ తెలిపారు.




 


ఈ కొత్త విధానం ద్వారా నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గౌరవ సత్కారమందించే ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.