మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పొలిటికల్ రీ ఎంట్రీపై ఆయన కుమార్తె శర్మిష్ఠ స్పందించారు.  ఈ సందర్భంగా శర్మిష్ఠ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైనంత మాత్రానా ప్రణబ్ రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారనేది సత్యదూరమన్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆయన ఎప్పడూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి  పునఃప్రవేశం చేస్తారని.. వచ్చే ఎన్ని ప్రధాని అధ్యర్ధిగా ఉంటారని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ప్రణబ్ కమార్తె , కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.


శివసేన పార్టీ సీనియర్ నేత రౌత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాలు కోల్పోతుందని..అప్పుడు అందరికీ ఆమోదయోగ్యుడైన ప్రణబ్ ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ప్రణబ్ కు రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని ఆయన కూతరు శర్మిష్ఠ వ్యాఖ్యానించడం గమనార్హం.