హైదరాబాద్: హీరో రాజశేఖర్ యాక్సిడెంట్ కేసు కొలిక్కి వచ్చింది. డ్రైవింగ్ సమయంలో ఆయన మద్యం సేవించలేదని పోలీసులు నిర్ధారించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో రాజశేఖర్ నిద్రమాత్రలు వేసుకొని కారు నడిపినట్లు తేలింది. తల్లి చనిపోయిన డిప్రషన్‌లో ఉండి నిద్రమాత్రలు వేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నటుడు రాజశేఖర్ ఆదివారం రాత్రి తన కారుతో యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవించి యాక్సిడెంట్ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. అసలు విషయాన్ని తేల్చారు.