రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఒక బస్సు.. వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటన శనివారం ఉదయం సవోయ్ మాధాపూర్ జిల్లా దుబి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల  సంఖ్య పెరగవచ్చు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING