Khel Ratna Award: భారతదేశంలో  క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత  పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న (Rajiv Gandhi Khel Ratna Award)పేరును ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న  అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే.. వారి మనోభావాలను గౌరవిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఖేల్​రత్న అవార్డుకు మేజర్​ ధ్యాన్​చంద్​ పేరు పెట్టాలని అనేకమంది నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఖేల్​రత్న పురస్కారానికి మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న అవార్డుగా ఇకపై పిలుస్తారు. జై హింద్​!" అని ప్రధాని మోదీ (PM Modi) ట్వీట్​ చేశారు. 



 


Also read: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: ఎస్బీఐలో బంగారంపై రుణాలు.. యోనో యాప్‌తో వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ఆఫర్స్


ఖేల్ రత్న అవార్డు దేశంలో అత్యున్నత క్రీడా గౌరవం. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద రూ. 25 లక్షల ప్రైజ్ మనీని ఇస్తారు. అదే విధంగా టోక్యో ఒలింపిక్స్ లో (Tokyo olympics) అసాధారణరీతిలో పోరాట పటిమ ప్రదర్శించిన పురషులు, స్తీల హాకీ జట్లును మోదీ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి  వీరి విజయాలు దోహదపడతాయని మోదీ తెలిపారు.


Also read: ఓ మై కడవులే తెలుగు రీమేక్: విజయ్ సేతుపతి పాత్రలో అల్లు అర్జున్ ?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook