హర్యానాలోని సిర్సా ప్రాంతంలో డేరా సచ్చా సౌధా ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని నెలకొల్పి.. ఎందరో మహిళలను బందీలుగా చేసుకున్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి దొంగ బాబా ఒకరు ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లు.. ఎందరో మహిళలను లొంగదీసుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని నెలలుగా వీరేంద్ర దేవ్ దీక్షిత్ అనే బాబా నడుపుతున్న ఆశ్రమాలపై లెక్కకు మించి కేసులు నమోదవుతున్న క్రమంలో ఢిల్లీ హైకోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. ఆ బాబాపై వారెంట్ కూడా జారీ చేసింది. ఇప్పటికే అదే ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న రోహిణి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో చదువుతున్న 40 మంది విద్యార్థులను ఢిల్లీ మహిళా  కమీషన్ బయటకు తీసుకొచ్చింది. అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై బాబా అత్యాచారం చేశాడనే ఆరోపణలు తలెత్తడంతో కమీషన్ కోర్టును ఆశ్రయించింది.