రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి వ్లాదిమిర్ పుతిన్‌కి స్వాగతం పలికారు. భారత్-రష్యా 19వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్ వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కానున్నారు.