న్యూఢిల్లీ: ఇప్పటివరకు అక్కడో ఇక్కడో వాలిన కరోనా.. ఇప్పుడు ఏకంగా వెస్ట్ ఢిల్లీలోని ఏకంగా ఒక కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్ అని తేలడంతో దేశమంతా ఉక్కిరిబిక్కరి అవుతోంది. వెస్ట్ ఢిల్లీలోనే  25 ఏళ్ల పేటీఎం ఉద్యోగి థాయిలాండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చాడు. అస్వస్తతకు గురైన ఆయన ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కాగా, అనుమానం వచ్చిన మిగతా ఆరుగురు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించగా వారందరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం ఏడుగురిని వెస్ట్ ఢిల్లీలోనే తమ నివాసంలోనే అన్నీ ఏర్పాట్లు  చేసినట్లు  ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య అధికారి తెలిపారు.


దీంతో అతని భార్య, తల్లిదండ్రులు, సోదరుడు, బావ వారి ఇద్దరు పిల్లలతో  మొత్తం కుటుంబం గృహ నిర్బంధంలో ఉందని, వారి నమూనాలను పరీక్ష కోసం తీసుకున్నారని, ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా కరోనా వైరస్ సోకినా వ్యక్తితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 31 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..