Shocking Love Story: ప్రేమ కోసం కొంతమంది ఎంతదాకైనా వెళ్తారు. మనసు చంపుకుని బతకడం కంటే మనసిచ్చిన వ్యక్తితో బతికేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. ఈ ప్రేమ పిచ్చి కొన్నిసార్లు నిజంగానే పిచ్చితనంలా అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఈశాన్య రాష్ట్రం అస్సాంలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి నుంచి తననెవరూ విడదీయవద్దని ఓ యువతి ఏకంగా హెచ్ఐవి రక్తం ఎక్కించుకుంది. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అస్సాంలోని సువల్‌కచీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. అతనిది యువతి పక్క గ్రామమే. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా, ప్రేమగా మారింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం యువతికి పిడుగు లాంటి వార్త తెలిసింది. తాను ప్రేమించిన వ్యక్తి అనుకోకుండా హెచ్ఐవి బారినపడ్డాడని తెలుసుకుంది. అయినప్పటికీ అతనిపై ప్రేమను చంపుకోలేదు. 


హెచ్ఐవి సోకినా సరే తన జీవితం అతనితోనే అని నిర్ణయించుకుంది. మూడుసార్లు అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కానీ పారిపోయిన ప్రతీసారి కుటుంబ సభ్యులు ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవారు. ఇక ఇలా అయితే లాభం లేదనుకున్న యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి హెచ్ఐవి రక్తాన్ని సిరంజీతో ఎక్కించుకుంది. ప్రియుడి నుంచి తననెవరూ విడదీయవద్దనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది.


Also Read: Vice President Poll Live Updates: జగదీప్ ధనకర్ వర్సెస్ మార్గరెట్ ఆల్వా.. భారత కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో?


Also Read: Horoscope Today August 6th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook