ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ పై బూటు విరిసిన ఘటనపై ఎంఐఎం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ త్రిపుల్ తలాక్ పై ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ పై విమర్శలు చేస్తుండగా ఓ అగంతకుడు ఆయనపై బూటు విసిరి పరారయ్యాడు. అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ తాను మరణానికి భయపడను అని పేర్కొన్నారు. అనంతపురం ఆయన తాజా ఘటనపై ముంబై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అసద్ ఫిర్యాదును స్వీకరించిన ముంబై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.