మైసూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈసారి రాజకీయ అంశాలతో కాకుండా అందరి ముందే తన వ్యక్తిగత సహాయకుడిపై చేయి చేసుకోవడం ద్వారా సిద్ధరామయ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం మైసూరు ఎయిర్ పోర్ట్ వెలుపల మీడియా పాయింట్ దాటుకుని నాలుగైదు అడుగుల దూరం ముందుకెళ్లిన సిద్ధరామయ్య.. అక్కడ తన పక్కనే ఉన్న వ్యక్తిగత సహాయకుడిని ఏదో మందలిస్తూ అతడి చెంప చెళ్లుమనిపించారు. ఆ తర్వాత అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకుండా అతడిని ముందుకు నెడుతున్నట్టుగా వీపుపై తడుతూ ముందుకు వెళ్లిపోయారు. మైసూర్ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన సిద్ధరామయ్య వెనకాలే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కనే చిక్కింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


సిద్ధరామయ్య పబ్లిక్‌గా ఇలా అసహనాన్ని వ్యక్తపర్చడం ఇదేం మొదటిసారి కాదు.. ఇదే మైసూరుకు సమీపంలో ఇదే ఏడాది జనవరి 29న జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్య.. అక్కడ తనను నిలదీసిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.