Tamilnadu Blast: తమిళనాడులో (Tamilnadu) విషాదం చోటుచేసుకుంది.  విరుదునగర్‌ జిల్లా (Virudhunagar District) సాత్తూర్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో (Fireworks Factory) పేలుడు సంభవించి..నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడం ఈ నెలలో ఇది రెండోసారి. జనవరి 1న సాత్తూర్‌ (Sattur) సమీపంలోని కళత్తూర్‌ గ్రామంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 7గురు గాయపడిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
సాత్తూర్‌ సమీపంలోని ఏళాయిరం పణ్నై మంజల్‌వోడై పట్టి ప్రాంతంలో కరుప్పస్వామి అనే వ్యక్తికి బాణాసంచా కర్మాగారం ఉంది. ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో 10మందికి పైగా కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా.. పేలుడు (Blast) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కరుప్పస్వామి సహా నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఓ గది పూర్తిగా ధ్వంసమైంది. 


Also Read: Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 24 మందికి గాయాలు!


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని..శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఏళాయిరం పణ్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాణాసంచా రసాయనాలు కలుపుతుండగా రాపిడి కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి