ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. కాగా గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ సీఎంల ఎంపికే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగునుంది. పార్టీ నేతల అభిప్రాయం అనంతరం ప్రధాని మోడీ ..ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎం అభ్యర్ధులను ప్రకటిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.


రేసు గుర్రాలు వీరే..


* గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో  విజయ్ రూపానీ, ఆర్సీ ఫాల్దు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మనుషుఖ్ మండవియా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్లు వినిపిస్తున్నాయి.
* హిమాచల్ ముఖ్యమంత్రి రేసులో  జైరామ్ ఠాకూర్ , ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో వున్న ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్లు వినిపిస్తోంది.