బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today) స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్‌ విధించినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో నేటి (మార్చి 27న) బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి. లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 carat Gold Silver price in Andhra Pradesh


హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో బంగారం ధర ఒక తులానికి రూ.180 పెరిగింది.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,810కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,260కి జంప్ అయింది. గత పదిరోజుల గరిష్ట ధరకు బంగారం చేరుకోవడం గమనార్హం. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగానే  పెరిగింది. బంగారం ధర రూ.180 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,250కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.42,050కి జంప్ అయింది. కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి 


కాగా, బంగారం ధరలు పెరగగా వెండి ధర తగ్గింది. గత రెండు రోజులు పెరిగిన వెండి ధరలకు గురువారం బ్రేక్ పడింది. 1 కేజీ వెండి రూ.310 మేర తగ్గింది. దీంతో 1కేజీ వెండి ధర రూ.41,510 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.41,510కి క్షీణించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ