కోల్కతా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)లో వెలుగుచూసిన భారీ కుంభకోణం ప్రకంపనలు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు తాకుతున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ దెబ్బకు యూకో బ్యాంకు కూడా రూ.2,636 కోట్ల రూపాయలు నష్టపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘మా హాంకాంగ్‌ బ్రాంచ్‌- పీఎన్‌బీ నుంచి వచ్చిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ డాక్యుమెంట్‌ను, స్విఫ్ట్‌ మెసేజ్‌ను పరిశీలించింది. క్లయింట్లలో -పీఎన్‌బీలో మోసానికి పాల్పడ్డవారు (నీరవ్‌ మోదీ, ఛోక్సీల కంపెనీలు) ఉన్నట్లు తాజాగా తేలింది. సుమారు 411.82 మిలియన్‌ డాలర్ల (రూ 2636 కోట్ల) మేర చెల్లింపులు చేశాం. ఈ మొత్తాన్ని గ్యారంటీ ఇచ్చిన పీఎన్‌బీ భర్తీ చేస్తుందని ఆశిసున్నాం’’ అని యూకో బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  


ఇప్పటిదాకా పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌ఓయూల వల్ల అలహాబాద్‌ బ్యాంకు ($336.87 మిలియన్లు), యూనియన్‌ బ్యాంకు($300 మిలియన్లు) మాత్రమే నష్టపోయాయని భావిస్తున్న కేంద్రానికి యూకో బ్యాంక్‌ సమాచారంతో మరో షాక్ తగిలింది.