జైలుపాలైన ఏఐఏడీఎంకే నేత శశికళ భర్త నటరాజన్ మరుతప్ప చెన్నైలోని గ్లెనీగల్స్ గ్లోబల్  ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 1.35 గంటలకు మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న నటరాజన్‌.. తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు వారాల క్రితం చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చేరారు.


నటరాజన్ 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. డీఎంకేలో చురుకైన పాత్ర పోషించారు. జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుడిగానూ వ్యవహరించారు.


మరోవైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు పరప్పణ అగ్రహార కారాగారంలో అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న శశికళ గతంలోనూ పెరోల్‌పై భర్తను చూసేందుకు బయటకు వచ్చారు.