Foreign Vaccine: కరోనా ఉధృతిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాల్సి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీ వ్యాక్సిన్లకు ఇండియాలో పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని డీసీజీఐ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అయితే ఇండియాలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ వ్యాక్సిన్లకు ఇచ్చే అనుమతి ప్రక్రియలో కీలక మార్పులు చేసింది డీసీజీఐ. ఈ మార్పుల ప్రకారం వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో(WHO) అత్యవసర వినియోగపు అనుమతి పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. డీసీజీఐ(DCGI) తీసుకున్న ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్లకు ఇండియాలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది. 


కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై(Covid19 Vaccine) ఏర్పాటు చేసిన నిపుణులు బృందం చేసిన సూచన ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ఎఫ్‌డీఏ, యూకే‌ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జపాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర జాబితాలో ఉన్న వ్యాక్సిన్లకు మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడీ రెండు కంపెనీలు గ్లోబల్ టెండర్లలో పాల్గొనవచ్చు.


Also read: India Corona Cases Live Updates: ఇండియాలో మళ్లీ పెరిగిన Covid-19 మరణాలు, అదొక్కటే ఊరట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook