హైదరాబాద్: రేపటి నుంచి  హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభకానుంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు జరగనుంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహించడమే ఈ సదస్సు లక్ష్యం. ఇదే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 175 మంది ప్రతినిధులు 53 సెకన్లు చొప్పున ప్రసంగించనున్నారు. దీనికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్షరెన్స్ సెంటర్ (హెచ్ఐసీసీ )  వేదిక కానుంది. కాగా ఈ సమ్మిట్ లో ఇవాంక ట్రంప్ తో సహా 1500 మంది పారిశ్రామిక వేత్తలు హాజరౌతున్నారు. ఇవాంక ట్రంప్ అమెరికా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆమె సదస్సుకు హాజరౌతున్నారు. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వంతో కలిసి నీతి ఆయెగ్ నిర్వహిస్తోంది. కాగా దక్షిణాసియాలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.