హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరౌతున్న ప్రతినిధులు మూడు రోజల పాటు నగరంలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి కావాల్సి అన్ని సౌర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. కాగా తొలి రోజు కేంద్ర ప్రభుత్వం తరఫున ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ లో అతిధులకు ప్రధాని  మోడీ విందు ఇవ్వనున్నారు. ఈ నెల 29న  గోల్కోండ హోటల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిధులకు విందు ప్రత్యేక విందు ఇస్తున్నారు. విందు సందర్భంగా మన తెలుగు సంసృతీ ,సాంప్రదాయాలు ప్రతిబించేలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాగా సదస్సుకు చివరి రోజైన మూడో రోజు అమెరికా తరఫున ఇవాంకా ట్రంప్  నోవాటెల్ హోటల్ లో అతిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.