న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షామీ మంగళవారానికి భారత మార్కెట్‌లో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎంఐ వార్షికోత్సవం పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జులై 10 నుంచి 12 వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు షామీ రూ.4 ఫ్లాష్‌సేల్‌ నిర్వహిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రూ.4కే ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ4 (55అంగుళాలు), రెడ్‌మి వై1, వై2, రెడ్‌మి నోట్‌5 ప్రో, ఎంఐ బ్యాండ్‌2లను ఫ్లాష్‌సేల్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు.. షామీ నిర్వహించే గేమ్ ఆడితే ఎంఐ మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌2 లాంటి ఫోన్లను గెలుపొందొచ్చు. ఎస్‌బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా మరికొంత రాయితీని పొందవచ్చు.


ప్రస్తుతం మార్కెట్లో రెడ్‌మి వై1 రూ. 8,999, ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ4 రూ 44,999, రెడ్‌మి నోట్‌5 ప్రో రూ. 14,999, రెడ్‌మి  వై 2 రూ.8,999లకు లభిస్తోంది.


ఒకవేళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్‌ సేల్స్‌ చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్‌మి నోట్‌ 5ను, ఎంఐ వీఆర్‌ ప్లే 2ను కేవలం రూ.9,999కే(వీటి అసలు ధర రూ.11,298) అందించనున్నట్టు షావోమి తెలిపింది. రెడ్‌మి వై1, ఎంఐ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌లను 8,999 రూపాయలకే (అసలు ధర రూ. 9,898) కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, పవర్ బ్యాంక్స్, పాకెట్ స్పీకర్‌లతో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై రాయితీని అందిస్తున్నామని తెలిపింది.


మధ్యాహ్నం 12 గంటలకు..


మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్‌బస్టర్‌ ఆఫర్‌ కింద ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని రూ.13,999కు, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు అందిస్తోంది. ఎంఐ మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌2లపై కూడా రాయితీని అందిస్తోంది.


ఎంఐ మిక్స్‌2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్స్‌‌2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌ రూ.1,899(ఎంఆర్‌పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్‌ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్‌ 2 రూ.1,599(ఎంఆర్‌పీ రూ.1,799) అందిస్తోంది. వీటితో పాటు ఎంఐ ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్‌ హెచ్‌ఆర్‌ఎక్స్‌ ఎడిషన్‌(రూ.1,299) ఎంఐ బ్యాండ్‌ స్ట్రిప్‌ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398అందించనుంది.