పూణేకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇటీవలే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు.కాలుష్యం గురించి అవగాహన పెంపొందించేందుకు, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బేటీ బచావో-బేటీ పడావో' (బీబీబీపీ) పథకాన్ని ప్రచారం చేసేందుకు విన్నూత తరహాలో ఈ యాత్రను చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా యాత్రికుల్లో ఒకరైన పూజా తానాజీ బాధవలే మాట్లాడుతూ "మాకు అద్భుతమైన అనుభవం లభించింది. ఈ మార్గంలో వివిధ గ్రూపులు మాకు సహాయపడ్డాయి. నవంబర్ 27న రైలు ద్వారా మేము జమ్మూకు చేరుకున్నాం. నవంబర్ 30న సైకిల్ యాత్ర ప్రారంభించాం" అని ఏఎన్ఐకు తెలిపారు. 


"కాలుష్య ప్రమాదాలపై అవేర్‌నెస్ కలిగించడంతో పాటు , బేటీ బచావో-బేటీ పడావో అనే సందేశాలను వ్యాప్తి చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం". మా ఈ యాత్రను లేహ్‌లో చనిపోయిన సైకిలిస్ట్ అజయ్ పడ్వాల్‌కు అంకితం చేస్తున్నాము" అని మరో బైకర్ సైలి మిలింద్ మహారావ్ ఏఎన్ఐకి తెలిపారు.