COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dry Dates Benefits In Summer Season: ఎండు ఖర్జూరాలు శరీరానికి కావాల్సిన పోషక గుణాలు మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా ఖనిజాలు విటమిన్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎండు ఖర్జూరాలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల వాటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే ఎండు ఖర్జూరాల్లో ఫైబర్ మెగ్నీషియం సోడియం, మ్యాంగనీస్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి.. కాబట్టి వీటిని పాలలో నానబెట్టి మరిన్ని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని ఎండాకాలంలో ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
ఖర్జూరాల్లో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతారు. ఇందులో ఉండే ఈ పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి తరచుగా ఉదయం పూట తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని ఇటీవలే కొన్ని పరిశోధనాల్లో తేలింది. అంతేకాకుండా ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచికలు ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


మూత్రపిండాల సమస్యకు..
అధ్యయనాల ప్రకారం ఎండు ఖర్జూరాలను తినడం వల్ల మూత్రపిండాలలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి వస్తాయి. దీని కారణంగా వాటి పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే తరచుగా మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు ప్రతి రోజు ఖర్జూరాను ఉదయం పూట తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే మూత్రపిండాల సమస్యల నుంచి ఖర్జూర ఎంతగానో సహాయపడుతుంది.


ఐరన్ లోపం సమస్యలకు..
ఐరన్ లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గి అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఐరన్ లోపం సమస్య స్త్రీలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు ఎండు ఖర్జూరాను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం మంచి సులభంగా విముక్తి లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మలబద్దానికి..
మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా ఎండబెట్టిన ఖర్జూర ప్రభావవంతంగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పూట రాత్రి నానబెట్టిన ఖర్జూరాను తీసుకోవడం వల్ల అన్ని రకాల పుట్ట సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు సులభంగా మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా పుట్ట సమస్యలతో బాధపడేవారు కూడా ఎండు ఖర్జూరం తీసుకోవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి