7th pay commission: ఆ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త.. కేంద్రం బాటలో.. డీఏ పెంపుకు ఆమోదం..!

Tue, 22 Oct 2024-8:00 pm,

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంపుతో..ఉద్యోగులకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అటు కేంద్రంలో డీఏ పెంపుతో రాష్ట్ర ఉద్యోగులు కూడా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూడా డిఏ పై నిర్ణయం తీసుకోకపోరా.. అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీఏ పెంచుతూ నిర్ణయం.. తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు టీచర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..ప్రస్తుతం కేంద్ర బాటలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.    

ముఖ్యంగా ఉద్యోగుల కోసం డిఏ పెంచుతూ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా రాష్ట్రంలోని లక్షలాదిమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

దీపావళికి ముందు కేంద్రం ఎలా అయితే 3 శాతం డి ఏ పెంచిందో , ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో కూడా మూడు శాతం డి ఎ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెంచిన ఈ డియర్ నెస్ అలవెన్స్ జూలై 1 నుండి వర్తిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం చొప్పున డిఏ ఇస్తుండగా.. డి ఎ పెరిగితే అది కేంద్ర రేటుతో సరిపోలుతుంది అని సమాచారం.  అలా 53% డి ఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది.   

నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ అలాగే పెన్షనర్ల డియర్ నెస్ రిలీఫ్ ను.. జూలై 1 2024 నుండి ప్రకటించిన డిఏ తో అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే.  అందుకే ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా మరో రూ.9,448 కోట్లు పోనుంది అని సమాచారం.   

ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ డి ఏ పెరిగితే ఆ రాష్ట్ర ఖజానాకి చిల్లు పడినా.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట కలుగుతుంది అని చెప్పవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link