7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. ఒకేసారి డబుల్ బొనంజా

Thu, 30 May 2024-7:13 pm,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతుంది. మొదటి పెంపు జనవరిలో, రెండో పెంపు జూలై నెలలో ఉంటుంది.  

ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెరిగింది. దీంతో డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతానికి చేరింది.  

AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా మరోసారి ఉద్యోగులకు 4 శాతం పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 54 శాతానికి చేరనుంది.  

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 8వ వేతన సంఘం ప్రవేశపెడుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. పదేళ్లకు ఒకసారి కొత్త పే కమిషన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

డీఏ 50 శాతం దాటితే.. ఆ భత్యాన్ని మొత్తం బేసిక్ పేలో కలిపేసి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారు. ఈ విషయంపై లోక్‌సభ ఎన్నికల తరువాత క్లారిటీ రానుంది.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను AICPI ఇండెక్స్ ఆధారంగా పెంచుతున్న విషయం తెలిసిందే.   

గమనిక: ఇక్కడ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే రాసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను చెక్ చేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link