7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

Sun, 17 Jan 2021-10:44 am,

7th Pay Commission Latest News: కొత్త సంవత్సరం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(Dearness Allowance), డీఆర్(Dearness Relief) అందించాలని యోచిస్తోంది. జనవరి నుంచే ఉద్యోగులు కొత్త వేతనాలు అందుకోబోతున్నారని సమాచారం.

డీఏ, డీఆర్ పెంపు వల్ల సుమారు 61 లక్షల మంది పెన్షనర్లు(Pension) సైతం ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుత 28 శాతం ద్రవ్యోల్బణ రేటు ప్రకారం కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంపును ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు ప్రచారంలో ఉన్నాయి.

Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసోసియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ వర్కర్స్ ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్‌కు తెలియజేసింది. దీంతో ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 28 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ మరియు డీఆర్ మంజూరు చేయాలని ఆమెకు సూచించినట్లు సమాచారం.

కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై అదనంగా డీఏపై రూ .12,510 కోట్లు, డీఆర్‌పై అదనంగా రూ .14,595 కోట్లు  భారం పడనుంది. సాధారణంగా డీఏ, డీఆర్‌లను ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు మొదటి విడత జనవరి నుండి జూన్ వరకు మరియు రెండో విడత జూలై నుండి డిసెంబర్ వరకు ప్రకటిస్తారని తెలిసిందే.

Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 4 శాతం 21 శాతానికి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ ఈ పెంపును గత కొన్ని నెలలుగా నిలిపివేశారు. తాజాగా ఈ మొత్తాన్ని జనవరి జీతంతో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link