7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల పెంపునకు అప్పుడే గ్రీన్ సిగ్నల్..!

Fri, 06 Sep 2024-5:21 pm,

ఈసారి డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది.  

ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. అంతకుముందు 46 శాతం ఉండగా.. 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెంచితే.. 53 శాతం అవుతుంది.  

అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే ఈ నెల చివరి వారంలో డీఏ పెంపు ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఒకేసారి మూడు నెలల బకాయిలు అందుకుంటారు. దీంతో భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది.   

ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదిలో రెండుసార్లు కేంద్రం జీతాలు పెంచుతున్న విషయం తెలిసిందే. డీఏ పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ లబ్ధి చేకూరుతుంది.  

గత నాలుగు త్రైమాసికాల్లోనూ డీఏ 4 శాతం పెరిగింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా కేంద్రం పెంచుతున్న విషయం తెలిసిందే.  

జనవరి నుంచి జూన్ నెల వరకు వచ్చిన AICPI ఇండెక్స్ డేటా ప్రకారం 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

మరోవైపు కొత్త పే కమిషన్ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. 7వ వేతన సంఘం మరో ఏడాదిన్నరలో ముగుస్తున్న నేపథ్యంలో త్వరలోనే 8వ వేతన సంఘం ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.  

కొత్త పే కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తే.. దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెంపు ఉంటుంది.   

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.          

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link