7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31తో ముగియనున్న తుది గడువు

Thu, 25 Mar 2021-10:03 am,

Special Festival Advance Scheme | కేంద్రం ప్రభుత్వం హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మార్చి 31, 2021లోగా నగదును తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

వాస్తవానికి 7వ వేతన సంఘం(7th Pay Commission) అమలు చేయాల్సిన దాంట్లో ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను పేర్కొనలేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా ప్రత్యేకమైనది. గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ నగదు పొందడానికి అర్హులు అవుతారు. గతంలో 6వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పథకం కింద రూ.4500 కేటాయించారు. ఈ ఏడాది దానిని రెట్టింపు కన్నా అధికం చేశారు.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ నగదు మొత్తాన్ని 10 సులభమైన వాయిదాల ద్వారా తిరిగి చెల్లించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రీపెయిడ్ రుపే కార్డు రూపంలో ఈ నగదును అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఛార్జీలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. డిజిటల్ పద్దతిలో రూ.10వేలను ఫెస్టివల్ అడ్వాన్స్‌డ్ స్కీమ్ కింద పొందవచ్చు. 

Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి

7వ వేతన సంఘం నిర్ణయాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం లీవ్ ట్రావెల్ కన్సెషన్ (Leave Travel Concession)కు అనుమతి ఇచ్చింది. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగులు ప్రయాణాలు చేయలేని కారణంగా వారికి ఊరట కలిగించేందుకు ఎల్‌టీసీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఏదైనా వస్తువులుగానీ, లేదా సేవలను కొనుగోలు చేసి ఎల్‌టీసీ కింద వాటిని పొందపరచాలి. అయితే జీఎస్టీ 12 లేదా అంతకన్నా ఎక్కువ శాతం ఉన్న వస్తువులు, సేవలపై మాత్రమే LTCని వినియోగించుకోగలరు. మార్చి 31, 2021 లోపు ఈ సేవలు ఉపయోగించుకోవాలని గుర్తుంచుకోండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 4 సంవత్సరాల కాలవ్యవధిలో ఎల్‌టిసిని పొందుతారు. ఉద్యోగుల పే స్కేల్ ప్రకారం విమాన లేదా రైలు ప్రయాణాలు చేయగా ఆ ఛార్జీలను ప్రభుత్వం వారికి తిరిగి చెల్లిస్తుంది. ప్రస్తుత 2018-21 బ్లాక్‌లో ఉద్యోగులు LTC పొందలేకపోయారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రభావం కారణంగా జనవరి 1, 2020, జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మరియు డీఆర్‌ల పెంపు, ఈ 3 దఫాల చెల్లింపులను వాయిదా వేస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link