Nayanathara: ఆ సినిమా చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన తార షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Thu, 20 Jun 2024-2:32 pm,

స్టార్ హీరోయిన్ నయతార ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి. నయన తార   సినీ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గజినీ మూవీ మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 2008 లో విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది.

కానీ ఇటీవల ఈ సినిమాపై నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో హీరోగా సూర్య చేశారు. ఏఆర్ మురుగదాస్ దీన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల నయనతారా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ మూవీ ఒప్పుకొవడం అత్యంత చెత్తనిర్ణయమని నయనతార వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

గజిని సినిమాలో నా రోల్ ను కథ చెప్పిన దానికి, తెరకెక్కించిన దానికి పొంతన లేదన్నారు. తన ఫోటోలను సినిమాలో పూర్తిగా భిన్నంగా చూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ కారణం వల్ల గజిని సినిమా చేయడం చెత్త నిర్ణయం అని నేను భావిస్తున్నట్లు నయన్ పేర్కొన్నారు.

ఈ సినిమా విషయంలో నేను ఎవరినీ, విమర్శించాలని అనుకోవడం లేదని, ఇదితనకు గుణపాఠంగా స్వీకరిస్తానని నయన్ చెప్పుకొచ్చారు. నయనతార వివాదస్పద వ్యాఖ్యలపై మురుగదాస్ సైతం రియాక్ట్ అయ్యారు. గజిని సినిమా కోసం ఎవరి రోల్ ను ప్రత్యేకంగా రాయలేదని ఆయన అన్నారు.

కొన్నిసార్లు పెద్ద హీరోయిన్లకు సైతం నిడివి తక్కువ ఉన్న రోల్స్ రాయాల్సి వస్తుందని మురుగదాస్ చెప్పుకొచ్చారు. అది మన చేతుల్లో లేదని ఆయన సమాచారం ఇచ్చారు. అయితే గజిని విషయంలో నయన్ విమర్శలు చేసినా మురుగదాస్ మాత్రం ఆమెకు దర్బార్ సినిమాలో అవకాశం ఇచ్చారు. 

దర్బార్ మూవీ తెలుగులో ఫ్లాపైనా 2020 సంవత్సరంలో ఎక్కువ వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఈ సినిమా గా రికార్డులు నెలకొల్పింది. నయనతార పారితోషికం 15 నుంచి 20 కోట్ల రూపాయలకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లైన కూడా నయనతారకు మూవీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నయన తార ఇటీవల గజినీ మూవీ పై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link