Herione: 14 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఊహించలేదు భయ్యా..!

Sat, 26 Oct 2024-11:00 am,

ఒకప్పుడు తన అంద చందాలతో టాలీవుడ్ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటి రంభ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది హీరోల సరసన నటించి మెప్పించింది.   

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె కన్నడ తో పాటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను కూడా అలరించి ఆఖరికి భోజ్ పురి భాషలో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పదుల సంఖ్యలో.. సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నట్టుగానే వివాహం చేసుకొని సినిమాలకు దూరమయింది. 

వ్యాపారవేత్తతో వివాహం జరిగి హాయిగా జీవితం గడుపుతున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు,  ఒక కుమారుడు కూడా జన్మించారు.  కెనడాలోని టొరంటోలో సెటిల్ అయినా ఈ జంట.. విడాకులకు సిద్ధమైందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇంస్టాగ్రామ్ లో ఫ్యామిలీతో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతూ.. ఆ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఈమె వయసు 48 సంవత్సరాలు. విజయవాడలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు పండగలను విదేశాలలో కూడా చాలా సాంప్రదాయంగా చేసుకుంటూ ఉంటుంది.   

తన పిల్లలకి కూడా భారతీయ సంస్కృతిని నేర్పించాలని భారతదేశానికి తిరిగి రావాలనుకుంది. అయితే ఆమె భర్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ మాత్రం అమెరికా వెళ్లాలనుకున్నారు. అలా ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా రంభ క్లారిటీ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య విడాకుల గొడవలు ఎక్కువగా జరిగినప్పుడు,  ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మేమే సర్దుకుపోయాం అంటూ తెలిపింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link