RamyaKrishna: 21 ఏళ్ల తర్వాత విసుగొచ్చిందా.. విడాకులకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..!

Wed, 23 Oct 2024-11:47 am,

తాజాగా 21 ఏళ్ల తర్వాత తన వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతోంది అంటూ ఒక స్టార్ హీరోయిన్ పై రూమర్ సంచలనం సృష్టిస్తోంది.ఆమె ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. తాజాగా తన భర్త డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది.  

90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ 2003లో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక కాలంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇప్పుడు విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ 21 ఏళ్ల వైవాహిక బంధం లో విసుగు వచ్చిందని అందుకే ఆమె అతడి నుంచి విడిపోతోంది అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది.   

రమ్యకృష్ణ విషయానికి వస్తే.. బాహుబలి సినిమాతో శివగామిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్న రమ్యకృష్ణ గత కొంతకాలంగా  తన భర్త నుంచి దూరంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి

ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రమ్యకృష్ణ , కృష్ణవంశీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. ఇకపోతే ఈ జంటకు ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link