Triptii Dimri: టాలీవుడ్ బిగ్ స్టార్ సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన యానిమల్ హాట్ బ్యూటీ..తృప్తి డిమ్రికి క్యూ కడుతున్న అవకాశాలు..

Tue, 06 Aug 2024-3:10 pm,

తృప్తి డిమ్రీ నటిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 యేళ్లు అవుతున్న.. లాస్ట్ ఇయర్  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా పాపులార్ అయింది.

ఈ సినిమాలో ఈ అమ్మడి స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మూవీతో మరోసారి వార్తల్లో నిలిచింది. తృప్తి నటించిన ఈ బూతు సినిమాకు  దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ నోరెళ్ల బెట్టారు. 

తృప్తి డిమ్రి.. 2017లో శ్రీదేవి టైటిల్ రూల్ పోషించిన ‘మామ్’ మూవీలో చిన్న పాత్రలో మెరిచింది.ఆ ఇయర్ సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీస్ తో కథానాయికగా పరిచయమైంది.

ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అటు 2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో పేరు సంపాదింకుంది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

 

తృప్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ హానర్స్ తో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదవు పూర్తైయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్  లో నటనలో శిక్షణ తీసుకుంది.

లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీలో రణబీర్ కపూర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. 

మొత్తంగా యానిమల్ మూవీతో వచ్చిన పాపులారిటీ బ్యాడ్ న్యూస్ సినిమాకు బాగానే కలిసొచ్చింది. తాజాగా ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. అటు సలార్ 2లో ప్రభాస్ తో ఈ భామ చిందేయనున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాపై క్లారిటీ రానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link