Polavaram Ys Jagan Visit: పోలవరం పర్యటనలో, కేంద్రమంత్రితో బిజీబిజీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Fri, 04 Mar 2022-3:25 pm,

పునరావాస కాలనీ సందర్శన అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. పోలవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

అటు పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీను కూడా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించి..నిర్వాసితులతో మాట్లాడారు. 

మోదీ ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి ఉందని..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని హామీ ఇచ్చారు. 

ముందుగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి..నేరుగా గోకవరం సమీపంలోని ఇందుకూరుపేట పునరావాస కాలనీకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, జగ్గిరెడ్డి తదితరులున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పర్యటన కొనసాగుతోంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. 

అనంతరం నిర్వాసితుల కాలనీని సందర్శించి..బాగుందంటూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని..కాలనీలో మెరుగైన వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. 

ఇందుకూరుపేటలో ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇందుకూరుపేటలో నిర్వాసితులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు ముఖాముఖి ఏర్పాటైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link