Big Alert: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

Sun, 01 Sep 2024-6:53 pm,

ఉత్తరాంధ్రలో నిరంతరం కురుస్తున్న వర్షాలు అధికారులు మత్స్యకారులకు కుడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణం వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షాలు రెండు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు రేపు సోమవారం సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 9 మంది చనిపోవడం బాధకరమని అన్నారు.గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణ వర్షపాతం 37 సెం.మీ కురిసిందని సీఎం చెప్పారు.  

అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ సూచించారు. అంతేకాదు వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా రేపు సోమవారం 2వ తేదీ కూడా అన్ని స్కూళ్లు, కాలేజీలకు  సెలవు ప్రకటించారు.   

రానున్న 24 గంటలకు పైగా వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక విజయవాడలో కూడా కుండపోత వర్షంతో రోడ్లన్ని అస్తవ్యస్తంగా తయారయ్యాయి.  

అతి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే విశాఖపట్టణం విద్యాశాఖ అధికారులు రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీలు సెలవు ప్రకటించాయి.  ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించారు.  

ఇక ఈ జిల్లాలు మాత్రమే కాదు గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, కృష్ణ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా రేపు సోమవారం అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ , ప్రైవేటు రంగ స్కూళ్లు కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link