Traffic Alert: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. రేపు ఈ మార్గాల్లో రాకపోకలు బంద్‌

Fri, 27 Sep 2024-5:49 pm,

చిక్కుకుంటే నరకమే: ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎంత చిరాకే వాహనదారులకు తెలిసిందే. సమయం వృథా.. ఎన్నో పనులు వాయిదా పడుతాయి.

రాకపోకలపై ఆంక్షలు: హైదరాబాద్‌లో తరచూ ఏదో కార్యక్రమంతో వాహనాల దారి మళ్లింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి పలు మార్గాల్లో రాకపోకలపై నియంత్రణ విధించారు.

రాష్ట్రపతి పర్యటన: హైదరాబాద్‌ నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు.

స్నాతకోత్సవం: నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవానికి హాజరవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

రాష్ట్రపతి షెడ్యూల్‌: ఢిల్లీ నుంచి బయల్దేరే రాష్ట్రపతి ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్‌ శివారులోని హకీంపేట ఎయిర్‌ బేస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20కి నల్సార్‌ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. 

మరో షెడ్యూల్‌: మధ్యాహ్నం 3.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని భారతీయ కళా మహోత్సవ్‌ 2024ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.45కు హకీంపేట నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

దారి మళ్లింపు: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి బేగంపేట, పీఎన్‌టీ జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ర్టపతి నిలయం ప్రాంతాల్లో దారి మళ్లింపులు ఉంటాయి.

ట్రాఫిక్‌ పోలీస్‌ సూచన: ఆ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ సూచించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link