Mobile Tariffs: ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?

Sat, 21 Sep 2024-6:02 am,

టెలికాం ధరలు పెరగడంతో దిగ్గజ ఎయిర్‌టెల్‌, జియో, వీఐ కంపెనీ యూజర్లు లక్షల సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు. ఈ కంపెనీలు దాదాపు 27 శాతం వరకు ట్యారిఫ్‌లు పెంచాయి.  

రీఛార్జీ ప్లాన్‌ ధరలు అదనంగా మారడంతో చాలామంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఎందుకంటే అన్నీ ప్రైవేటు రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.  

ఈ నేపథ్యంలో ఈ మార్పును దృష్టిలో పెట్టుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు మరిన్ని కొత్త రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరలో ఏ ప్రైవేటు రీఛార్జ్‌ ప్లాన్స్‌ దీని దరిదాపుల్లో లేదు.  

దీంతో దిగ్గజ ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు లక్షల్లో తమ వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది. జియో 7.58 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోతే, ఎయిర్‌టెల్‌ 16.9 లక్షలు, వీఐ 14.1 లక్షల వినియోగదారులను కోల్పోయాయి.  

ఇదిలా ఉండగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం ఏకంగా 29 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు మారారు. త్వరలో ఈ కంపెనీ 5జీ సేవలను ప్రారంభించడానికి సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో 4 జీ సేవలను ముమ్మరం చేసింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link