Brahmotsavam 2024: తిరుమల బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు భారీ షాక్‌!

Mon, 07 Oct 2024-7:53 pm,

Tirumala: తిరుమల కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Tirumala: దసరా సందర్భంగా ఉత్సవాలతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

Tirumala: అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. 

Tirumala: ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అత్యధికంగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ద్విచక్రవాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది.

Tirumala: గరుడ సేవ కారణంగా అధిక భక్తుల రద్దీ ఉండడంతో ఈనెల 9వ తేది ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషిద్ధమని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Tirumala: అలిపిరి పాత చెక్ పోస్ట్ దగ్గర టీటీడీ మైదానంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలని టీటీడీ ద్విచక్ర వాహనదారులకు సూచించింది. 

Tirumala: కొత్తగా ఈ ఏడాది టాక్సీలను కూడా గరుడ సేవ రోజున అనుమతి లేదని తెలపడం గమనార్హం. ట్యాక్సీలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link