Air India: ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బంపర్‌ బొనాంజా.. రూ. 1,947 కే విమాన ప్రయాణం..

Sat, 03 Aug 2024-9:48 am,

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏయిర్‌ ఇండియా ప్రయాణీకులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఏయిర్‌ ఇండియా తన అధికారిక ఎక్స్‌ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. దీనికి ఫ్రీడం సేల్‌ అని నామకరణం చేసింది.  

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏయిర్‌ ఇండియా విమాన ప్రయాణీకులకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. టిక్కెట్టు ధరను కేవలం రూ.1947 నుంచి అందుబాటులో పెట్టింది. ఈ ఆఫర్ మూడు రోజులపాటు బుక్‌ చేసుకోవచ్చు. దీంతో సెప్టెంబర్‌ 30 వరకు ప్రయాణం చేయవచ్చు.  

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలనుకుంటే ఏయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. లగేజీ చెక్‌ ఇన్‌ కోసం ముందుగానే 3 కేజీల వరకు కూడా ముందుగానే బుక్‌ చేయవచ్చు. అయితే, 20 కేజీల లగేజీ వరకు రూ. 1300 చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా ఒక వేళ మీరు దేశీ ప్రయాణం చేయాలనుకుంటే 15 కేజీల లగేజీకి వెయ్యి రూపాయాలు చెల్లించాలి.   

ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన ఈ ఆఫర్ పరమిత ఆఫర్ ముందుగా బుక్ చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వ్‌ చేసిన సీట్టు అమ్ముడైతే సాధారణ ఫ్లైట్‌ టిక్కెట్ల ధరలు వర్తిస్తాయి. అయితే, పేమెంట్‌ తర్వాత రీఫండ్‌ కూడా ఉండదు.  

ఈ రిజర్వ్‌ చేసిన టిక్కెట్లను ఇతరులకు ట్రాన్సఫర్ కూడా చేయకూడదు. ఈ స్పెషల్‌ సేల్‌ గురించిన మరిన్ని వివరాలు ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.ఇందులో అంతర్జాతీయంగా 15, దేశీయంగా 32 గమ్యస్థానాలకు ఏయిర్‌ ఇండియా ప్రయాణం అందుబాటులో ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link