YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌

Wed, 25 Sep 2024-11:31 pm,

తీవ్ర దుమారం: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం రాజుకుంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

తిరుమలపై రాజకీయం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ వివాదంపైనే రాజకీయం నడిపిస్తున్నారు.

ఈ క్రమంలో తమపై నింద వేయడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిప్పికొట్టారు.

జగనే రంగంలోకి: ప్రెస్‌మీట్‌ నిర్వహించి స్పష్టంగా చెప్పినా అధికార పార్టీ చేస్తున్న విష ప్రచారం ఆగకపోవడంతో మాజీ సీఎం జగన్‌ రంగంలోకి దిగుతున్నారు.

సీఎం చేసిన పాపం: చంద్రబాబు చేసిన మహాపాపానికి ఈనెల 28వ తేదీన పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు జగన్‌ పిలుపునిచ్చారు. అంతేకాకుండా తిరుమలను సందర్శించాలని నిర్ణయించారు.

పురంధేశ్వరి సవాల్: రంగంలోకి బీజేపీ: అయితే జగన్‌ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి స్వాగతించారు. అయితే స్వాగతిస్తూనే సంచలన సవాల్‌ విసిరారు. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే మాజీ సీఎం జగన్‌ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు.

డిక్లరేషన్: అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నెంబర్ 311, రెవెన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని జగన్‌కు పురందేశ్వరి సవాల్‌ విసిరారు.

ఏం జరగనుంది: మరి జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమల సందర్శిస్తారా? లేదా ఏం జరుగుతుందనేది శనివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link