Dates and Ghee Benefits: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా

Mon, 30 Sep 2024-10:31 pm,

నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతుంది

నెయ్యి, ఖర్జూరం మిశ్రమం చర్మ సంరక్షణలో కీలకంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్, ఖర్జూరంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషకాలను అందిస్తాయి. చర్మానికి నిగారింపు అందిస్తుంది. 

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పెద్దఎత్తున ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెండూ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. సీజన్ మారినప్పుడు ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.

ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. నెయ్యి కేటలిస్ట్‌గా పనిచేస్తుంది.

మలబద్ధకం లేదా విరేచనాల సమస్య ఉంటే ఈ రెండూ కలిపి సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. ఖర్డూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నెయ్యితో కలిపి సేవిస్తే కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

వాస్తవానికి నెయ్యిలో ఖర్జూరం పండ్లు నానబెట్టి తినడం పాత పద్ధతే. ఆయుర్వేదంలో దీని ప్రస్తావన ఉంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. ఇంకా ఏ లాభాలున్నాయో తెలుసుకుందాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link