Ganesh Immersion: గణేషుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు.. పొరపాటున నిమజ్జనం చేసిన జంట! ఆ తర్వాత గుర్తొచ్చాక..?

Thu, 12 Sep 2024-12:44 pm,

బెంగళూరుకు చెందిన ఓ టీచర్‌ కుటుంబానికి వినాయక చవితి ఉత్సవాల్లో అనుకోని ఘటన ఎదురైంది. వీళ్లు గోవిందనగర్‌లోని  ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వినయాక చవితి అంటే సెప్టెంబర్‌ 7న గణేశ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అయితే, విగ్రహాన్ని అలంకరించేటప్పుడు తమ వద్ద ఉన్న రూ.4 లక్షల విలువ చేసే బంగారు గొలుసును కూడా గణపయ్యకు అలంకరించారు.  

ఆ తర్వాత నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైంది. వారు గణపతి మెడలో పూలు పత్రితోపాటు బంగారు గొలుసు ఉన్న విషయం మరచిపోయారు. వారి ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ మొబైల్‌ ట్యాంకులో వినాయకుని పొరపాటున బంగారు గొలుసుతోపాటు నిమజ్జనం చేసి ఇంటికి వెళ్లిపోయారు.  

కాసేపటి తర్వాత గోల్డ్‌ చైన్‌ గురించి గుర్తొచ్చిన ఆ జంట వెంటనే మళ్లి మొబైల్‌ ట్యాంక్‌ వద్దకు వెళ్లి అక్కడి అధికారుల సాయం తీసుకుని గాలించారు. అయితే, వినాయకుడి నిమజ్జనం సమయంలోనే మెడలో గొలుసు చూశానని అక్కడ ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు.  కానీ, అది రోల్డ్‌గోల్డ్‌ అయి ఉంటుందని అనుకున్నాను అని చెప్పాడు.  

అయితే, అక్కడ ఉన్నవారు వెంటనే ఆ మొబైల్‌ ట్యాంకులో వెతకడం ప్రారంభించారు. అప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం జరగడం వల్ల మట్టి ఎక్కువగా పేరుకుపోయింది. ఎన్నో గంటలు కష్టపడ్డారు అయినా దొరకలేదు. చేసేదేం లేక ఆ ఉపాధ్యాయ జంట మగదీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే  సాయంతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.  

ఓ పది గంటలపాటు విస్త్రతంగా వెతికిన తర్వాత బంగారు గొలుసు దొరికింది. దీంతో ఆ ఉపాధ్యాయ జంట ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే ఆ ట్యాంక్‌లో 300 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ బంగారు గొలుసును వెతకడానికి  మొత్తంగా ఆ మొబైల్‌ ట్యాంక్‌ నుంచి 10 వేల లీటర్ల నీటిని కూడా తోడాల్సి వచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link