Dusshera: బెజవాడ కనకదుర్గమ్మకు ధగధగలాడే వజ్రాల కిరీటం.. రూ.కోట్ల విలువైన కానుక

Thu, 03 Oct 2024-4:02 pm,

సంబరాలకు వేళాయే: దసరా సంబరాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది.

ఉత్సవాలు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు విజయవాడ పండుగ శోభ సంతరించుకోనుంది. 

కిరీటం: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఓ భక్తుడు ఊహించని కానుకను అందించాడు. శరన్నవరాత్రి ప్రారంభోత్సవాల రోజే బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా వచ్చింది.

అజ్ఞాత భక్తుడు: బంగారం, వజ్రాలతో తయారుచేసిన కిరీటాన్ని అమ్మవారికి ఓ అజ్ఞాత భక్తుడు కానుకగా ఇచ్చాడు.

కోట్ల విలువ: విలువైన వజ్రాలతో పొదిగిన ఆ కిరీటం ఖరీదు రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం.

ఉత్సవాల తొలి రోజు అమ్మవారు ఆ వజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భక్తులతో కిటకిట: శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. వరదల తర్వాత తొలిసారి విజయవాడకు పండుగ శోభ చేకూరింది.

ప్రత్యేక కార్యక్రమాలు: కాగా ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ ఆలయ పాలకమండలి రద్దు చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link