EPFO Pension Updates: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు బిగ్‌ అప్‌డేట్.. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

Thu, 12 Dec 2024-4:59 pm,
EPFO Latest Updates

ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అభ్యర్థన వచ్చిందని తెలిపారు.  

EPFO

ఈపీఎస్ పెన్షన్‌లను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాతినిధ్యాలపై ఏదైనా అంచనా వేసిందా..? అని కూడా ఒవైసీ అడిగారు.   

EPFO News

మంత్రి సమాధానం ఇస్తూ.. “EPS 1995 అనేది 'డిఫైన్డ్ కంట్రిబ్యూషన్-డిఫైన్డ్ బెనిఫిట్' సామాజిక భద్రతా పథకం. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ (i) వేతనంలో యజమాని నుంచి 8.33 శాతం సహకారం అందుతుంది.   

నెలకు రూ.15,000 వరకు వేతనాలలో 1.16 శాతం వరకు బడ్జెట్ వరకు కేంద్ర సహకారం ఉంటుంది.." అని తెలిపారు.  

ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు ఈపీఎస్ ఫండ్ నుంచి చెల్లిస్తామని.. ప్రతి సంవత్సరం ఫండ్ మూల్యాంకనం ఉంటుందన్నారు. 31 మార్చి 2019 నాటికి ఫండ్ వాల్యుయేషన్ ప్రకారం యాక్చురియల్ నష్టం ఉందని వెల్లడించారు.  

2014లో తొలిసారిగా ప్రభుత్వం ఈపీఎస్ 1995 కింద పింఛనుదారులకు నెలకు కనీసం రూ.1000 పెన్షన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు.   

అయితే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్-95 కింద పెన్షన్‌ను నెలకు రూ.2 వేలకి రెట్టింపు చేయాలని గతేడాది ప్రతిపాదించగా.. కేంద్రం నంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link