Gautam Adani: రేవంత్‌ రెడ్డి సంచలనం.. మరోసారి గౌతమ్‌ అదానీతో భేటీ, రూ.100 కోట్ల విరాళం

Fri, 18 Oct 2024-5:39 pm,

 దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

అదానీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటూ వివాదానికి తెరలేపుతోంది.

మరోసారి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో రేవంత్‌ రెడ్డి సమావేశమై సంచలనం రేపారు.

రేవంత్‌ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమైన అనంతరం అదానీ కొన్ని అంశాలపై చర్చించినట్లు సమాచారం.

కొత్త ఏర్పాటుచేయాలనుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి గౌతమ్‌ అదానీ రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.

మరోసారి గౌతమ్‌ అదానీ, రేవంత్‌ రెడ్డి సమావేశమవడంతో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link