Glowing Skin Tips: ఈ పూవ్వు నీటితో ముఖానికి రెట్టింపు నిగారింపు.. నిత్యయవ్వనం..

Tue, 23 Apr 2024-7:52 am,

మందారపూవుతో ముఖానికి రెట్టింపు నిగారింపు వస్తుంది. ఇందులో విటమిన్ సి ,విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ చర్మం నునుపుగా మారుతుంది. మీ చర్మం నిత్యయవ్వనంగా మారుతుంది.  

మందారపూవుతో నీటిని తయారు చేసుకోవాలి. ఇది రోజ్‌ వాటర్‌ మాదిరి మంచి టోనర్‌లా ఉపయోగపడుతంఉది. దీనికి ఓ 3 మందారపూలను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద వేడిచేయాలి.  

ఆ తర్వాత మందార నీటిని చల్లారబరచాలి. ఇప్పుడు ఈ నీటిని ఓ బాటిల్‌ల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇది మంచి టోనర్‌గా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఏదైనా ఫేస్‌ ప్యాకులు ఉపయోగించినప్పుడు కూడా అందులో ఈ నీటిని ఉపయోగించాలి. మంచి గ్లో వస్తుంది.  

మందార నీటిలో మీ ముఖాన్ని స్ప్రే చేసుకుంటూ ఉంటే మీ చర్మం తక్కువ సమయంలోనే రెట్టింపు నిగారింపుతో నునుపుగా మారుతుంది. దీంతో మీరు వేలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు ఇంట్లోనే మీ ముఖం సహజసిద్ధంగా మెరిసిపోతుంది.  

మందార నీటిని ప్యాక్‌లో కూడా వేసుకుని ఉపయోగించవచ్చు. 2 చెంచాల ముల్తానీ మట్టి ,2 చెంచాల పెరుగు కలపాలి. మందార నీటిని అవసరమైన మేరకు మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత సాధారణ నీటితో ఫేస్‌వాష్‌ చేసుకోవాలి.  

ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు ముఖానికి వేసుకోవడం వల్ల మంచి గ్లోతోపాటు చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link