Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

Thu, 08 Apr 2021-9:03 am,

Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు ఆకాశ్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి సైతం రికార్డు ధరలు నమోదు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. తాజాగా రూ.280 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,530 వద్ద మార్కెట్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,650 అయింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా మళ్లీ పెరిగాయి. తాజాగా రూ.270 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,880 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.44,810 వద్ద మార్కెట్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. తాజాగా వెండి ధర రూ.16,60 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.66,660 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,600 మేర పెరిగింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.70,900కి చేరింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link