Gold Price In Hyderabad 20 April 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే

Tue, 20 Apr 2021-8:53 am,

Gold Rate Update 20 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు మిశ్రమంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో నేటి వెండి ధరలు మీకోసం.

Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.110 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,280కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,260 అయింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధర రూ.210 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,630కి పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,410 అయింది.

Also Read: Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పతనమయ్యాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.800 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,400 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.500 మేర పెరగడంతో 1 కేజీ ధర రూ.74,200 వద్ద మార్కెట్ అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link