Gold Price Today In Hyderabad 21 March 2021: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Sun, 21 Mar 2021-7:25 am,

Gold Price Today 21 March 2021: బులియన్ మార్కెట్‌లో వారం రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధర తాజాగా జోష్ అందుకుంది. పసిడి ధరలు పెరగగా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి.

Also Read: LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో డెత్ బెనిఫిట్, Maturity Benefit

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్ కేంద్రాలలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.160 మేర పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,090కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,250 అయింది.

దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. తాజాగా రూ.170 మేర బంగారం ధర పెరిగింది. దీంతే నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,440 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400కి చేరింది.

Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం

బులియన్ మార్కెట్‌లో సాయంత్రం తగ్గిన వెండి ధరలు తాజాగా పెరిగాయి. వెండి ధర రూ.200 మేర స్వల్పంగా పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,800 అయింది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link